విటిపిఎస్ లో అగ్ని ప్రమాదం
ఈ కేంద్రానికి భూపాలపల్లి నుంచి ట్రాన్స్ ఫార్మర్లు వస్తున్నాయి. వీటిని బిహెచ్ఇఎల్ సరఫరా చేస్తోంది. బిహెచ్ఇఎల్ నాణ్యతను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గత నెల 26వ తేదీన కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదుత్పత్తి 300 నుంచి 365 మెగావాట్లకు చేరుకుంటున్న సమయంలో కేంద్రంలో మంటలు లేస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు 4 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఒక అంచనా. ప్రాజెక్టు వ్యయంతో పొల్చుకుంటే నష్టం ఎక్కువగా జరుగుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Comments
Story first published: Tuesday, November 24, 2009, 9:37 [IST]