Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చానెల్ పై దాడి: పోలీసు కస్టడీకి రౌత్

Attack
ముంబై: మరాఠీ చానెల్ పై దాడి కేసులో శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ ను ఈ నెల 27వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఐబిఎన్ - లోకమత్ మరాఠీ న్యూస్ చానెల్ కార్యాలయంపై దాడికి ఆయననే సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. రౌత్ మంగళవారంనాడు పార్క్ సైడ్ పోలీసు స్టేషనులో లొంగిపోయారు.

నవంబర్ 20వ తేదీన శివసైన కార్యకర్తలు ఐబిఎన్ - లోకమత్ కార్యాలయంపై దాడి చేశారు. ఉద్యోగులను కొట్టారు. తమ నేత బాల్ థాకరేపై వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రసారం చేస్తోందనే ఆగ్రహంతో వారు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో రౌత్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఇప్పటికే 14 మంది శివసేన కార్యకర్తలను పోలీసులు ఆరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+