వరుణదేవుడే ముంచిండు: కెసిఆర్

గత 56 ఏళ్లుగా హామీల, వాగ్దానాల, ఒప్పందాల ఉల్లంఘన ఆంధ్ర వలస పాలకుల వంతు, ఉద్యమాలు తెలంగాణవారి వంతు అవుతోందని ఆయన అన్నారు. తాను పుట్టడడానికి రెండేళ్ల ముందే 1952లో తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఆయన అన్నారు. అన్ని అంశాల్లో ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక చర్యలు కొనసాగుతూనే వస్తున్నాయని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ఉల్లంఘనలు జరుగుతూ వస్తున్నాయని ఆయన అన్నారు. తాము 2001లో ఉద్యమం చేపట్టిన తర్వాత తాము తాత్కాలిక విజయాలు సాధించామని ఆయన చెప్పారు. తాము ఉద్యమం చేస్తుంటే తమ పార్టీతోనే తెలంగాణ వస్తుందని కాంగ్రెసు నాయకులు మొత్తుకున్నారని, సభలు పెట్టారని, తామే ఉద్యమాలు చేస్తున్నామని మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు వంద సార్లు అని ఉంటారని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారంలో ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కోవర్టు వ్యవహారం చేశాయని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత లేదని ఫ్రీజోన్ విషయంలో వ్యవహరించిన తీరు వల్లనే అన్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు తన వైఖరి చెప్పరని ఆయన అన్నారు.
కాంగ్రెసులో కొన్ని మొరిగే కుక్కలున్నాయని, వాటికి బలిసెటట్లు మేపి రోజూ మొరిగిస్తున్నారని, ఉద్యమాన్ని కింది మీద చేయాలనే కుట్ర చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్ర వలస దురాక్రణదారులు కబళిస్తూ వస్తున్నారని, నేడు హైదరాబాదును రేపు ఆదిలాబాదును కబళిస్తారని ఆయన అన్నారు. కడుపు మండి మాట్లాడితే తెలుగు భాష అని, మరేదో అని అంటారని, సమస్యపై ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, తెలంగాణ మేధావులు విజ్ఞత ప్రదర్శించలేదని, అందుకే కేంద్రమైనా కదులుతుందనే ఉద్దేశంతో తాను బలిదానానికి సిద్ధపడ్డానని ఆయన చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలపై, ప్రజలపై అణచివేత చర్యలకు దిగుతున్నారని, తెలంగాణ అంతటా ప్రజలు ఆందోళనకు దిగుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications