హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విరక్తితో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Hitech City
హైదరాబాద్: లాడ్జిలో సాఫ్ట్ వేర్ ఇంజినీరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమీర్ పేట లోని కోట్ల లాడ్జిలో జరిగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో ఉన్న ఫ్రీ స్కేల్ సాఫ్ట్ వేర్ సంస్ధలో విశాఖపట్నానికి చెందిన దొమ్మేటి సుమన్ (26) ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి లాడ్జిలో రూము తీసుకున్నాడు. శనివారం రాత్రి 11 గంటలకు రూమ్ బాయ్ తలుపు కొట్టగా తెరవలేదు. పోలీసులను పిలించి తలుపులు పగులగొట్టి చూడగా ప్లాస్టిక్ వైరుతో సుమన్ ఉరి వేసుకుని కన్పించాడు.

"నా చావుకు ఎవరూ కారణం కాదు. నటించే ఈ లోకంలో బతకలేక చనిపోతున్నాను. నేను పెళ్ళి చేసుకుని తనని కూడా బాధపెట్టలేక ఆత్మ హత్య చేసుకుంటున్నాను. నేను ఎవరికీ బాకీ లేను. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వారు మా వాళ్ళకి ఇవ్వగలరు." అని ఒక లేఖ రాసి పెట్టాడు. ఆ లేఖ పక్కనే తన అన్న పేరుతో లక్షన్నరకు చెక్కు రాసి పెట్టాడు. లాడ్జి వారికి 10 వేలు చెల్లించి మి గితా సొమ్ము ఉంచుకోమని అన్నకు రాశాడు. పెళ్ళి ఇష్టం లేకపోతే తమకు చెప్పి ఉండాల్సిందని సుమన్ అన్న వాపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X