పులివెందులలో పోటీకి టిడిపి దూరం

పులివెందులలో వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రతిపక్షాల నాయకులను కోరారు. ఆయన ఆదివారం సాయంత్రం ప్రతిపక్షాల నాయకులకు ఫోన్ చేసి ఆ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుతోనే కాకుండా ఆయన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో మాట్లాడారు. మిగతా ప్రతిపక్షాల నాయకులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ స్థితిలో పులివెందులలో ఇతర పార్టీలు పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications