వరంగల్ జిల్లాలో రైల్ రోకో, లాఠీచార్జి
అలాగే జిల్లాలోని పలు విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులనెదుర్కొంటున్నారు. మొత్తంమీద జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
కాకతీయ విశ్వవిద్యాలయంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్దులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంతో క్యాంపస్లో గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఈ లాఠీచార్జ్ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
warangal telangana తెలంగాణ వరంగల్ lathi charge ఉద్యమం కాకతీయ యూనివర్సిటీ agitation రైల్ రోకో kakatiya university kazipet
Story first published: Monday, November 30, 2009, 17:19 [IST]