కఠోర దీక్షలో కెసిఆర్: జయశంకర్

దీక్ష విషయంలో ప్రభుత్వమే గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అంశం కీలకదశకు చేరుకుందని, ఇలాంటి సమయంలో విమర్శలు మానుకోవాలని తెలంగాణ వాదుల ఉద్దేశించి అన్నారు. ఖమ్మం నుంచి కేసీఆర్ను తరలించాలని ఆయన డిమాండ్చేశారు. బెయిల్ తీసుకోబోమని, దీక్ష కొనసాగుతుందని, అనుమానాలు అనవసరమని, ప్రాణత్యాగానికైనా కేసీఆర్ సిద్ధమేనని జయశంకర్ చెప్పారు.
ఖమ్మంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులతో మాట్లాడామని ఆయన చెప్పారు. ఖమ్మంలో తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం ఉన్నందునే కేసీఆర్ స్థలమార్పిడి కోరుతున్నారని జయశంకర్ అన్నారు.












Click it and Unblock the Notifications