హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై తీర్మానానికి తిరస్కారం, వర్చకు సిద్ధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశంపై శాసనసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిరాకరించింది. శాసనసభ స్పీకర్‌ ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభావ్యవహారాల మండలి(బిఎసి) సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని టిఆర్‌ఎస్‌ పార్టీ పట్టుబట్టింది. ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. తీర్మానం ప్రవేశపెడితే మద్దతిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి మొదలవుతాయి. ఈ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి.

బిల్లు పెడితే మద్దతు: బిజెపి
ప్రత్యేక తెలంగాణపై లోకసభలో బిల్లుపెడితే మద్ధతిస్తామని భాజపా ప్రకటించింది. తెలంగాణ అంశాన్ని లోక్‌సభలో ఆ పార్టీ నేత సుష్మస్వరాజ్‌ లేవనెత్తారు. ప్రత్యేక రాష్ట్రానికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ అంశాన్ని రాజ్యసభలో ఆ పార్టీ నేత వెంకయ్యనాయుడు లేవనెత్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X