ప్రత్యేక తెలంగాణ కోసం చార్మినార్ పై టీచర్ల ర్యాలీ
దీంతో ప్రత్యేక తెలంగాణ నినాదంతో ఉస్మానియా హోరెత్తిపోయింది. ప్రత్యేక తెలంగాణ కోరుతూ టీఆర్ఎస్ రెండు రోజుల బంద్కు పిలిపు నిచ్చిన నేపథ్యంలో రెండో రోజైన సోమవారం అక్కడక్కడ చెదురు ముదురు సంఘటనల మినహా బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
ఈ బంద్కు మద్దతు పలుకుతూ విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్చ్చందంగా మూసివేశారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా జనజీవనం స్తంభించింది. వరంగల్జిల్లా కాజీపేటలో ఓ ప్యాసింజర్ రైల్లో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో రైల్ను నిలిపివేసి పోలీసులు బాంబ్ స్వ్కాడ్తో తనికీలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణీల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విద్యార్ధులను రోడ్డుపైకి రాకుండా ముందస్తు చర్యగా ఉస్మానియా వర్శిటీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం పంజాగుట్ట, అమీర్పేటలలో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని, వర్శిటీ రిజిష్ట్రార్ ఇచ్చిన లేఖతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ బి. ప్రసాదరావు తెలిపారు.