వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఆరోగ్యంపై అట్టుడికిన పార్లమెంటు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోగ్య పరిస్థితిపై బుధవారం పార్లమెంటు ఉభయసభలు అట్టుడికాయి. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై లోకసభలో చర్చ జరగగా, తీవ్ర దుమారం చెలరేగి రాజ్యసభ వాయిదా పడింది. తెలంగాణ అంశాన్ని, కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని లోకసభలో ప్రతిపక్ష నాయకుడు ఎల్ కె అద్వానీ ప్రస్తావించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తాము తెలంగాణకు మద్దతిస్తున్నట్లు, యుపిఎ ప్రభుత్వం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో చెప్పినట్లు తెలంగాణపై చర్యలు తీసుకోవాలని ఆర్జెడి సభ్యుడు రఘువంశ ప్రసాద్ రాయ్ అన్నారు. తెలంగాణకు ఆర్జెడి, బిజెపి, సిపిఐ, శివసేన మద్దతు తెలిపాయి. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది.

కెసిఆర్ దీక్ష విరమించేలా చూడాలని, తగిన నిర్ణయం తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు. తమకు కెసిఆర్ ఆరోగ్యం ముఖ్యమని డిఎంకె అన్నది. రాజ్యసభలో బిజెపి సభ్యుడు వెంకయ్యనాయుడు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రమాదం సంభవిస్తుందని బిజెపి సభ్యులు అన్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు. జీరో అవర్ లో ప్రస్తావించినందున దీనికి మంత్రి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సభాపతి ఎంతగా చెప్పినా బిజెపి సభ్యులు వినిపించుకోలేదు. సద్దుమణగపోవడంతో రాజ్యసభను సభాపతి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X