తెలంగాణపై సీనియర్లతో చంద్రబాబు భేటీ
కేంద్రం ప్రకటనను శుభపరిణామంగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అన్నదమ్ముల్లా ఆంధ్ర, తెలంగాణ ప్రజలం విడిపోదామని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రక్రియ ప్రారంభిస్తుందా, లేదా అనే విషయంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యహాన్ని మధ్యాహ్నం ఖరారు చేసుకుంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
Comments
hyderabad హైదరాబాద్ తెలుగుదేశం telangana తెలంగాణ devender goud telugudesam chandrababu naidu దేవేందర్ గౌడ్ చంద్రబాబు నాయుడు
Story first published: Thursday, December 10, 2009, 11:07 [IST]