నేను రాజీనామా చేయలేదు: స్పీకర్

Kiran Kumar Reddy
హైదరాబాద్: తన పదవికి తాను రాజీనామా చేసినట్లు, రాజీనామా చేసే యోచనలో తాను ఉన్నట్లు వచ్చిన వార్తలను శాసససభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. తాను రాజీనామా చేయలేదని ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తనపై ఎవరి ఒత్తిడి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. తాను స్పీకర్ గా కొనసాగుతానని ఆయన చెప్పారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముందు ఆయనతో రాజ్యసభ సభ్యుడు కెవి రామచందర్ రావు, ముఖ్యమంత్రి కె.రోశయ్య మంతనాలు జరిపారు.

మొత్తం 93 మంది శాసనసభ్యులు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో 53 మంది కాంగ్రెసు, 29 మంది కాంగ్రెసు, 11 మంది ప్రజారాజ్యం పార్టీ సభ్యులున్నట్లు ఆయన తెలిపారు. తన కన్నా ముందే మీడియా వారి పేర్లను తెలియజేస్తోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏ ప్రాంతానికి చెందినవారు ఎంత మంది అనేది తాను చూడలేదని, కొందరు స్వయంగా రాజీనామా లేఖలు ఇచ్చారని, మరికొందరు ఫ్యాక్శ్ ద్వారా పంపారని, తాను వివరాల్లోకి వెళ్లలేదని ఆయన చెప్పారు.

రాజీనామా చేసినవారిని పిలిపించి మాట్లాడిన తర్వాతనే వాటి ఆమోదంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. రాజీనామాల విషయంలో తాను నడుచుకోవాల్సిన విషయంపై ఎవరో తనకు చెప్పాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారం నడుచుకుంటానని ఆయన చెప్పారు. తాను రాజీనామాలను ఆమోదించలేదు కాబట్టి సభ యధావిధిగా రేపు సమావేశమవుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+