వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లగడపాటి విడుదల: దీక్ష యోచన విరమణ
తెలుగుజాతి ఐక్యతకు ఎవరూ భంగం కలిగించలేరని ఆయన అన్నారు. తెలంగాణపై తీర్మానం పెడితే 225 మంది శాసనసభ్యులు వ్యతిరేకంగా ఓటేసి తెలుగుజాతి ఐక్యతను చాటి ఉండేవారని, తెలుగుజాతి ఐక్యతను చాటడానికి శానససభ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దీక్ష కోసం హైదరాబాదు వచ్చిన తనను పోలీసు అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ఇంతకాలం ఒకే వాదన ఉందని, ఇప్పుడు విభజన వాదం ముందుకు వచ్చిందని, రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి బలహీనపరచాలని చూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాజకీయ నేతలు లాభం పొందడానికి చూస్తున్నారని, తాను ప్రజల మేలు కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, December 14, 2009, 15:18 [IST]