వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి రాజీనామా: సమైక్యాంధ్రకే జై

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన గురువారం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తిరుపతి వెళ్తారు. అక్కడ ఆయన సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తారు. తెలంగాణ పార్టీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సమైక్యాంధ్ర వైపు వెళ్లాలనే నిర్ణయాన్ని తొలుత వాయిదా వేసుకున్నారు. అయితే చివరికి సమైక్యాంధ్ర వైపే మొగ్గు చూపారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా చిరంజీవి నిర్ణయం తీసుకుంటున్నారనే వార్తలు రావడంతో తెలంగాణలోని యువరాజ్యం కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ నాయుకులతో కూడా చర్చించారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని 15 రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నట్లు పార్టీ నాయకులతో చెప్పారు. తన కుటుంబ సభ్యులు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ సినిమాల పోస్టర్లను తెలంగాణ ఉద్యమకారులు ధ్వంసం చేశారు. రోజంతా చర్చలు జరిపిన అనంతరం తెలంగాణ నాయకులను కాదంటూ ఆయన సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉద్యమం చేయాలని బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇచ్చాపురం నుంచి సమైక్యాంధ్రకు అనుకూలంగా యాత్ర చేపడతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X