వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ తో సహా తెరాస ఎమ్మెల్యేల ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: అరెస్టు చేసి జైళ్లలో పెట్టిన తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు గురువారం సచివాలయంలోని ముఖ్యమంత్రి కె. రోశయ్య చేంబర్ ముందు ధర్నా చేశారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని వారు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రా, ఆంధ్రా ముఖ్యమంత్రా అంటూ వారు నినాదాలు చేశారు.

కొద్ది మంది ఆంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే సీమాంధ్ర ఉద్యమాలను నడుపుతున్నారని హరీష్ రావు చెప్పారు. వారి ప్రయోజనాల కోసమే సమైక్యాంధ్ర ఉద్యమమే సాగుతోందని ఆయన విమర్శించారు. కొద్ది సేపటికి ముఖ్యమంత్రి రోశయ్య వారిని చర్చలకు ఆహ్వానించారు. విద్యార్థులను విడుదల చేస్తామని రోశయ్య తమకు హామీ ఇచ్చినట్లు తెరాస శాసనసభ్యులు చెప్పారు. తాము 24 గంటల పాటు నిరీక్షిస్తామని, అప్పటికి కూడా విద్యార్థులను విడుదల చేయకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X