తెలంగాణకు హామీ: త్వరలో ఢిల్లీకి కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ఢిల్లీ కాంగ్రెసు పెద్దలకు కృతజ్ఞతలు తెలిపే మిషతో ఆయన ఢిల్లీకి వెళ్లి తన వ్యవహారాను నడిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై అధిష్టానం మనసు మార్చేందుకు కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, తెరాస మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ రహస్యంగా ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు సమాచారం. వారు ఢిల్లీకి వెళ్లిన విషయాన్ని, తిరిగి వచ్చిన విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు.

ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించడానికి జయశంకర్ గానీ వినోద్ కుమార్ గానీ ఇష్టపడడం లేదు. వివరాలను వెల్లడించడం వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మౌనం పాటిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులు వారికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రక్రియలో కాస్తా జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం నేతలు ఇచ్చిన హామీలను సందర్భం చూసి కెసిఆర్ వెల్లడించే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా జయశంకర్, వినోద్ కుమార్ కాంగ్రెసు అధిష్టానానికి వివరించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+