Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ప్రజలకు నేర్పిస్తా: మోహన్ బాబు

Mohan Babu
తిరుపతి: సమైక్యాంధ్రపై తాను తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పిస్తానని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. అమాయకులైన తెలంగాణ ప్రజలను రాజకీయ నాయకులు స్వార్థం కోసం మోసం చేస్తున్నారని, విభజనకు దారి తీయిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆయన గురువారం ఒక రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రంలోని దుష్ట చతుష్టయం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణలోని 90 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీకి కూడా చెందినవాడిని కానని, అయినా తన సినిమాలను అడ్డుకుంటున్నారని, కళాకారులుగా తమకు ప్రాంతాలుండవని ఆయన అన్నారు.

ఉద్యమాలను శాంతియుతంగా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన సూచించారు. ప్రాణత్యాగం చేయవద్దని ఆయన హితవు చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అన్ని ప్రాంతాలు మనవేనని ఆయన అన్నారు. విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ప్రజలకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ చర్య వల్ల రాష్ట్రం యుద్ధభూమిలా మారిందని ఆయన విమర్శించారు. దుష్ట రాజకీయాల వల్ల విడిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రాయలసీమ కూడా వెనకబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్తే పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+