వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి పరిగెత్తుకొచ్చారన్నారు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: సినిమా ఫక్కీలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ వచ్చారని ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశానంతరం ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజగోపాల్ ఆరోగ్యం ఎలా ఉందని మీడియా ప్రతినిధులు అడిగితే మీరే కదా పరుగెత్తుకొచ్చి బెడ్ మీద పడుకున్నారని చెప్పారని ఎదురు ప్రశ్న వేశారు. లగడపాటి రాజగోపాల్ విజయవాడ నుంచి హైదరాబాదుకు చేరడాన్ని కనిపెట్టి చర్యలు తీసుకోలేకపోయిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. చట్టాన్ని ఎలా ధిక్కరిస్తారని ఆయన అడిగారు. రాజగోపాల్ ఆరోగ్యంపై ప్రత్యేక బులిటెన్లు విడుదల చేస్తారా అడిగితే అవసరమైతేనే అలా చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పరిస్థితి విషమంగా ఉండి ఆందోళనకరంగా ఉండడంతో అలా విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

చట్టానికి సామాన్యులు, ప్రజాప్రతినిధులు వేరు కాదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కుమ్మక్కు కావడం వల్లనే రాజగోపాల్ ఇలా వచ్చేశారని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజగోపాల్ అదృశ్యంపై విచారణ జరిపిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు రాష్ట్ర పరిస్థితులు తెలుసునని ఆయన చెప్పారు. తెలంగాణవాదులు, సమైక్యవాదులు ఎవరి వాదనలు వారు పార్టీ అధిష్టానానికి వినిపించారని, అందువల్ల వారు సంయమనం పాటించి వేచి చూస్తే మంచిదని ఆయన అన్నారు. పోలీసులు సంమనం పాటించాలంటే చూస్తూ ఊరుకోవడం కాదని ఆయన అన్నారు. ఆందోళన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X