తెలంగాణపై వెనక్కి: 48 గంటల బంద్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ నెల 9వ తేదీన ప్రకటన చేసిన తర్వాత పార్టీలు తమ విధానాలు మార్చుకున్నాయని, ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం నుంచి పార్టీలు వెనక్కి తగ్గాయని, ఈ పరిస్థితిలో విస్తృత స్తాయి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణలో ఆందోళనకారులు 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. హైదరాబాదు సహా పలు జిల్లాల్లో రోడ్లను దిగ్బంధించారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. తెలంగాణ అంతటా రాష్ట్ర ప్రభుత్వం 144, 30 సెక్షన్లు విధించి పోలీసు, భద్రతా బలగాలను దింపారు. విశ్వవిద్యాలయాల్లోకి భారీగా పోలీసులను దింపారు. తీవ్ర అణచివేత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.












Click it and Unblock the Notifications