లగడపాటి అదృశ్యంపై నామ్ కే వాస్తే విచారణ

Lagadapati Rajagopal
విజయవాడ: అతను అధికార పార్టీ ఎంపీ. ఆయన అదృశ్యంపై సీఐడీ విచారణ అంట. నగరంలోని ప్రభుత్వాసుపత్రి నుంచి ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అదృశ్యమైన సంఘటన పై సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవ హారంపై సీఐడీ అదనపు డీజీ శివనారాయణను ప్రభుత్వం విచారణాధికారిగా నియమించిన విష యం తెలిసిందే. విచారణాధికారి శివనారాయణ బుధవారం సాయంత్రం నగరానికి చేరుకుని పోలీసు అతిధి గృహంలో విచారణను ప్రారం భించారు. ఆయన అతిధి గృహంలో ఉన్నంత సేపు బయట గేట్లు వేసే ఉంచారు. ఇతరులు ఎవరినీ లోపలకు రానీయలేదు.

ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ ఎంఎం భగవత్‌, డీసీపీ విజయ కుమార్‌తోపాటు ఆదివారం రాత్రి ప్రభుత్వాసు పత్రిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికా రులను అతిధి గృహానికి పిలిపించి పలు వివరా లను రాబట్టినట్లు సమాచారం. సుమారు రెండు గంటలపాటు హడావుడి నెలకొంది. అనంతరం ఆయన అతిధి గృహం నుచి బయటకు వెళ్లి పోయారు. అయితే ఎక్కడకు వెళ్లింది ఎవరికీ తెలి యలేదు. విచారణ మొత్తాన్ని చాలా గోప్యంగా ఉంచారు. అదనపు డీజీపీ శివనారాయణ ప్రభు త్వాసుపత్రికి వస్తారని పోలీసులు కూడా భావిం చారు. అయితే రాత్రి పది గంటల వరకు కూడా ఆయన అక్కడకు వెళ్లలేదు. విచారణకు సంబం ధించిన వివరాలను వెల్లడించేందుకు కూడా కమిషనరేట్‌ వర్గాలు నిరాకరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+