వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒయులో కాల్పులు: హైదరాబాద్ లో ఉద్రిక్తం

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: తెలంగాణ అనుకూల ఆందోళనకారులతో హైదరాబాద్ నగరం అట్టుకుడుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం భగ్గమంటోంది. విద్యార్థులను అడ్డుకోవడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో సహా రాష్ట్ర పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దిగారు. విద్యార్థులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆ తర్వాత భాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఇందులో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రాంతంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. విద్యార్థులను తరిమి తరిమి కొట్టారు. నిజాం కళాశాల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లోని సినీ యాక్టర్ల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. మోహన్ బాబుకు చెందిన పాఠాశాలపై ఆందోళనకారులు దాడి చేశారు. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పై కూడా దాడి జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై కాల్పులను కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు ఖండించారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X