వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు గిరీష్ సంఘీ సంసిద్ధత

By Pratap
|
Google Oneindia TeluguNews

Girish Sanghi
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, వార్త దినపత్రిక అధిపతి గిరీష్ సంఘీ రాజీనామాకు సిద్ధపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయినందుకు నిరసనగా ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని కోస్తాంధ్రలోని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్రం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులకు కాంగ్రెసుదే బాధ్యత అని ఆయన అన్నారు. తన రాజీనామా లేఖను స్పీకరుకు పంపించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు సమర్పించినట్లు ఆయన తెలిపారు.

కాగా, పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు గురువారం సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆమె వారికి సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు అపాయింట్ మెంటు ఇచ్చారు. తెలంగాణపై చిదంబరం తాజా ప్రకటనను నిరసిస్తూ 11 మంది లోకసభ సభ్యులు రాజీనామాలు సమర్పించడానికి సిద్ధపడ్డారు. సోనియాను కలిసి వారు రాజీనామాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోపల తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X