వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియాలో ర్యాలీ: జెఎసి నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటనను నిరసిస్తూ హైదరాబాదులోని భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణకు ద్రోహం చేసేందుకు కేంద్ర ప్రబుత్వం సిద్ధపడిందని విద్యార్థులు నిరసించారు. దీంతో పోలీసులు గురువారం విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నేతలను పోలీసులను అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీగా పోలీసులను మోహరించారు. హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఉస్మానియాను ఖాళీ చేయించే ఉద్దేశంతో పోలీసులు వ్యవహరిస్తున్నారు.

కాగా, తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు సాగుతున్నాయి. హైదరాబాదులో విద్యార్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లిలో సినినీటుడు పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పై ఆందోళనకారులు దాడి చేశారు. మిర్యాలగూడాలో ఆంధ్రా హోటళ్లపై దాడులు జరిగాయి. హైదరాబాదులో తెలంగాణ అమర వీరులకు విద్యార్థులు నివాళులు అర్పించారు. మా తెలంగాణ మాకు కావాలంటూ నినాదాలు చేశారు. కూకట్ పల్లిలో ఆందోళనకారులు బస్సుకు నిప్పు పెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X