వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రైస్తవుల కోసం రేపు బంద్ సడలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: క్రిస్మస్ పర్వ దినం సందర్భంగా రేపు శుక్రవారం బంద్ లో సడలింపు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. ఆలిండియా క్రైస్తవ సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు రేపు బంద్ పాటించవద్దని ఆయన గురువారం జెఎసి సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ రేపు బంద్ లో సడలింపు ఇవ్వాలని కోరుతూ ఆలిండియా క్రైస్తవ సంఘం రాసిన లేఖను ఆయన సభలో చదివి వినిపించారు.

క్రైస్తవ సోదరులకు ఏడాదికి ఒకటే పండుగ అని, వారు ఏ ఇబ్బంది లేకుండా పండుగ జరుపుకోవడానికి వీలుగా బంద్ లో సడలింపు ఇస్తున్నామని ఆయన చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుదామని ఆయన చెప్పారు. తెలంగాణకు ఆలిండియా క్రిస్టియన్ అసోసియేషన్ మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X