వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానికి ఆర్టీసీ బస్సులు లేక బెజవాడ జనం బేజారు

By Santaram
|
Google Oneindia TeluguNews

APSRTC
విజయవాడ: హైదరాబాద్ కు బస్సులు లేక ఆంధ్ర జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో వారు రైల్వేస్టేషన్ కు పరుగులు పెడుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్‌కు బయలు దేరిన బస్సులను అధికారులు వెనక్కి రప్పించారు. బస్టాండ్‌ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌ రూటులో పూర్తిగా నిలిపివేశారు. నార్కెట్‌పల్లి వద్ద ఆందోళనకారులు విజయవాడ డిపోనకు చెందిన గరుడా బస్సును ధ్వంసం చేసినట్లు ఆర్టీసీ అధికారవర్గాలు ప్రకటించాయి.

మరోవైపు ఇతర డిపోల నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సులకు సంబంధించి ప్రయాణికులకు చార్జీలు తిరిగి చెల్లించారు. బుకింగ్‌ కౌంటర్ల వద్ద అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను నిలిపివేశారు. సమాచార కేంద్రం ద్వారా తెలంగాణ , హైదరాబాద్‌, ఖమ్మం, తిరువూరు, భద్రాచలం రూట్లలో బస్సులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్‌ రూటులో బస్సులు రద్దవడంతో టికెట్లను కౌన్సిల్‌ చేయించుకునేందుకే బస్టాప్‌లో బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరి నిలబడ్డారు. హైదరాబాద్‌కు వెళ్ళాల్సిన ప్రయాణికులు కొందరు ఇంటికి తిరుగుముఖం పట్టగా మరికొందరు రైల్వేస్టేషన్‌కు పరుగులు తీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X