Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిదంబరం ప్రకటనతో శాంతించిన విశాఖ విద్యార్ధులు

Vishakapatnam
విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమంతో పదిహేను రోజులుగా వేడెక్కిన నగరం బుధవారం సాయంత్రం నుంచి ప్రశాంతంగా మారింది. ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి కేంద్ర హోంశాఖా మంత్రి చిదంబరం చేసిన తెలంగాణ ప్రకటనతో అన్నిపార్టీల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. ఆందోళనలు ప్రారంభించాయి. విధ్వం సాలు లేకపోయినా..శాంతియుత ఉద్యమాలతో నగరం హోరెత్తింది. జన జీవనం స్తం భించింది. బంద్‌, ధర్నా, రైల్‌ రోకో, రాస్తోరోకో, ర్యాలీ, రిలే, ఆమరణ నిరాహార దీక్షలతో నగరం అట్టుడికింది. వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళనకు దిగిన ఉద్యమకారులు సమైక్య వాదానికి బాసటగా ఎట్టకేలకు బుధవారం సాయంత్రం మళ్లీ కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనతో శాంతించారు. దీక్షా శిబిరాలను తొలగించారు. తమ దైనందిన వ్యాపకాలవైపు మొగ్గుచూపుతున్నారు.

ఆందోళనకు తొలి అడుగు వేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం చివరి వరకు సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచింది. 12 రోజుల పాటు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా వీరిని కింగ్‌ జార్జి ఆసుపత్రికి తరలించినా..వైద్యం నిరాకరించి తమ దీక్షలను కొనసాగించారు. వీరికి మద్దతుగా ఏయూ నుంచే వివిధ రాజకీయ పక్షాలు ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నాయి. విద్యార్థులకు సంఘీభావం తెలిపాయి. తొలి నాలుగు రోజులు విద్యార్థులే ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రెండు రోజులు నగర బంద్‌ నిర్వహించారు. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, రవాణా, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+