వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగంపై దాడి: ఇద్దరు వ్యక్తుల గుర్తింపు
నాగం జనార్దన్ రెడ్డిపై దాడి చేసిన మరో వ్యక్తిని రాజీవ్ రెడ్డిగా గుర్తించారు. ఇతను హైదరాబాదులోని ఎల్బీ నగర్ కోర్టులో న్యాయవాదిగా చేస్తున్నట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. నాగం జనార్దన్ రెడ్డిని పలువురు రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఆయనను పరామర్శించారు. నాగం జనార్దన్ రెడ్డిపై దాడికి సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
Story first published: Friday, December 25, 2009, 11:44 [IST]