వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓయు, కెయుల్లో కొనసాగుతున్న దీక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పట్టుబడుతూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు శుక్రవారం కూడా తమ దీక్షలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గుతూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఈ రెండు విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు.

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అదనపు భద్రతా బలగాలు చేరుకున్నాయి. విశ్వవిద్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఉస్మానియాలో తెలుగుదేశం నాయకులపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘటనను ఖండించాయి. దాడి చేసింది తాము కాదని విద్యార్థులు జెఎసి ప్రకటించింది. దాడి చేసిన వ్యక్తులను గుర్తించారు కూడా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X