జైపూర్: రాజస్థాన్ లోని కోటలో వంతెన కూలి ఏడుగురు మరణించారు. కూలిన వంతెన శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురువారం రాత్రి జరిగింది. చంబల్ నదిపై నిర్మిస్తున్న వంతెన అది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. ఈ విషయాన్ని స్థానిక జిల్లా అడ్మినిస్ట్రేషన్ టి. రవికాంత్ చెప్పారు.
గాయపడిన పలువురిని ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిని వెలికి తీసేందుకు సైన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధానికి ఇది 150 కిలో మీటర్ల దూరంలో ఉంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి