వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాడిపత్రిలో పేలుడు: విద్యార్థి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantapur
హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం తెల్లవారు జామున భారీ పేలుడు సంభవించి ఒక విద్యార్థి మరణించగా, డజను మంది దాకా విద్యార్థులు గాయపడ్డారు. వెంకటరమణ స్వామి ఆలయంలోని ఇంట్లో పేలుడుకు ఆ ఇంటితో పాటు పక్కనే ఉన్న ఆక్స్ ఫర్డ్ పాఠశాల కూడా ధ్వంసమైంది. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న యుగంధర్ అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. దాదాపు డజను మంది విద్యార్థుల కాళ్లూ చేతులూ విరిగాయి. యుగంధర్ తమ్ముడికి రెండు కాళ్లూ తీసేయాల్సి వచ్చింది.

నాటుబాంబులు పేలడంలో వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. నాటుబాంబులు పేలాయా, జిలిటెన్ స్టిక్స్ పేలాయా అనేది తెలియడం లేదు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. కొంత మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో తాడిపత్రిలో విషాద వాతావరణం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X