వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు కొందరి వాడయ్యారు: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి కొందరివాడయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు వ్యాఖ్యానించారు. చిరంజీవి అందరివాడిగానే బయలుదేరారని, అయితే సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టడం ద్వారా కొందరివాడయ్యారని ఆయన అన్నారు. జెఎన్టీయులో నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించారు. తెలంగాణ ఉద్యమం ప్రజల గుండె చప్పుళ్ల నుంచి వచ్చిందని, అందుకే ఇంత స్పందన ఉందని ఆయన అన్నారు.

అంధ్ర నాయకులే తప్ప ఆంద్ర ప్రజలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యమాల కారణంగా ఏ పరిశ్రమలు వెనక్కి వెళ్లాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమం వల్ల తెలుగు సినీ పరిశ్రమకు నష్టం జరిగిందనే వాదనను కూడా ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ బంద్ లో పాల్గొన్న హరీష్ రావును పోలీసులు మూసాపేట వద్ద అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనలకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు పగులగొట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X