వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి రోశయ్య ఎలా వెళ్తారు: అమోస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తెలంగాణపై జనవరి 5వ తేదీన జరిగే కేంద్ర ప్రభుత్వ సమావేశానికి వెళ్తానని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడం సరి కాదని కాంగ్రెసు సీనియర్ నేత కెఆర్ అమోస్ అన్నారు. రాజకీయ పార్టీల సమావేశానికి పాలకుడైన రోశయ్య వెళ్తానని అనడం సరి కాదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ ప్రతినిధిగా వెళ్లాలనుకుంటే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను సంప్రదించి వెళ్లవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమై కాంగ్రెసు వారు ఆ సమావేశానికి వెళ్లకపోవడమే మంచిదని ఆయన అన్నారు. తాను ఐదో తారీఖు సమావేశానికి వెళ్తానని రోశయ్య అనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. స్వచ్ఛందంగా తనకు తాను రోశయ్య అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన అడిగారు.

కేంద్రాన్ని తప్పుదోవ పట్టించుకోలవానుకునే వారు కేంద్ర చర్చలకు వెళ్లే ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. ఆ సమావేశానికి ఎవరిని పంపాలనే విషయంపై డి. శ్రీనివాస్ తర్జనభర్జనలు పడుతున్నారని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య అఖిల పక్ష సమావేశానికి హాజరవుతారని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. దాంతో రోశయ్య ఢిల్లీకి వెళ్లే విషయం ఖాయమైపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X