విశాఖపట్నం మహానగరంలో మరో ఫ్లై వోవర్ బ్రిడ్జి

Vishakapatnam Flyover
విశాఖపట్నం: మహా విశాఖ నగరపాలక సంస్థ మరో ఫ్లై ఓవర్‌ నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు ఇబ్బందికరంగా మారిన చావుల మదుం వద్ద మరో ఫ్లై ఓవర్‌ నిర్మించేందుకు జీవీఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం చావుల మదుం బ్రిడ్జి ఏన్నో ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అంతేకాకుండా బ్రిడ్జి గోడలు తరుచూ మరమ్మతులకు గురికావడం, పైన ఉన్న రైల్వే పట్టాలు కూడా ప్రజలకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం వస్తే ఆ జంక్షన్‌ పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ నేపథ్యంలో చావుల మదుం బ్రిడ్జిపై ఫ్లై ఓవర్‌ ను నిర్మించాలని జీవీఎంసీ చాలా కాలం నుంచి కసరత్తు చేస్తోంది. రైల్వే శాఖ నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో తక్షణమే ఈ పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకు రూ. 20 కోట్లు వరకు నిధులు అవసరం కాగా, మొత్తం జీవీఎంసీ భరించాల్సి ఉంది.

ప్రస్తుతం కాన్వెంట్‌ జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ ప్రారంభమై రైల్వే స్టేషన్‌కు ముందు ఉన్న అల్లిపురం వెళ్లే జంక్షన్‌ వద్ద ముగియనుంది. 1.1 కిలోమీటర్‌ పొడవునా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు జీవీఎంసీ ప్రాజెక్టు అధికారులు అంచనాలు తయారుచేస్తున్నారు. ఫ్లై ఓవర్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్ది నగరానికే తలమానికంగా తయారుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ జంక్షన్‌ ను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయునున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+