వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు చెప్పాల్సిన అవసరం లేదు: బొత్సా

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
విజయనగరం: తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ వైఖరిని వెల్లడించాల్సిన అవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ఇచ్చేది, అధికారంలో ఉన్నది కాంగ్రెసు పార్టీయే కాబట్టి తన వైఖరిని చెప్పాల్సిన అవసరం ఆ పార్టీకి లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్టీకే మిగతా పార్టీలు తమ వైఖరిని చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి మిగతా పార్టీలు వైఖరులను చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

తెలంగాణపై రాజకీయ పార్టీలను చర్చలకు పిలవడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి చర్చలా, ఓటింగా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియకు రాజకీయ పార్టీలతో చర్చలు జరపాల్సిన మార్గం తప్ప మరోటి లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X