జంటనగరాల్లో వేడుకలకు భారీ బందోబస్తు
విశ్వేశ్వరయ్య విగ్రహం వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను విశ్వేశ్వరయ్య వి గ్రహం వద్ద నుంచి ఖైరతాబాద్, రాజ్భవన్ వైపు మళ్లిస్తారు. బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చేవాహనాలను ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య హోటల్ వైపు పంపిస్తారు. లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఎంసిహెచ్ కార్యాలయం వై జంక్షన్ నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్రోడ్ వైపు వచ్చే వాహనాలను ఖైరతాబాద్ నుంచి మీరా థియేటర్ లేన్ వైపు పంపుతారు.
సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ రోడ్డును మూసేస్తారు. కనల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్యపార్కు, నెక్లెస్ రోడ్డు వైపు వాహనాలను అనుమతించరు. ఇటుగా వచ్చినవారిని కర్భలామైదాన్, మినిస్టర్స్ రోడ్డు వైపు పంపుతారు. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద నుంచి కవాడీగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్బండ్, కట్టమైసమ్మ ఆలయం వైపు పంపిస్తారు. వాహనదారులు ఆలయం నుంచి ఎడమవైపు తిరిగి అశోక్ నగర్, ఆర్టీసి క్రాస్ రోడ్స్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.