వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంప్రదింపుల ప్రక్రియకే చర్చలు: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: జనవరి 5వ తేదీ చర్చలు తెలంగాణపై కాదని, సంప్రదింపుల ప్రక్రియపై మార్గదర్శక సూత్రాల రూపకల్పనకు మాత్రమేనని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. జనవరి ఐదో తేదీ చర్చలకు రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ ఆయన గురువారం లేఖలు పంపారు. పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను చర్చలకు అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు సంప్రదింపులు ఎలా ఉండాలనే అంశంపై మాత్రమే జనవరి ఐదో తేదీన రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణపై చర్చల్లో అందరినీ భాగస్వాములను చేస్తామని, ప్రశాంతంగా ఉండాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ జనవరి 3వ తేదీన ఢిల్లీ బయలుదేరి వస్తున్నారు. కాంగ్రెసు తరఫున ఇద్దరు నేతలు ఢిల్లీకి వస్తారని శ్రీనివాస్ తెలిపారు. ఈ చర్చలకు ముఖ్యమంత్రి కె. రోశయ్యను పార్టీ తరఫున ఆహ్వానిస్తారా, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిగా ఆయనకు అహ్వానం అందుతుందా తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X