వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెగే దాగా లాగవద్దు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెగే దాకా లాగవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కోస్తాంధ్ర, రాయలసీమ నేతలకు సూచించారు. ఇప్పటికే విద్వేషాలు పెరిగాయని, ఈ విద్వేషాలను మరింత పెంచడం సరి కాదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సామరస్యగా విడిపోయి కలిసుందామని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు కూడా ఇరు ప్రాంతాల వారు ఘర్షణకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని, సామరస్యంగా విడిపోవడం ఎందుకైనా మంచిదని ఆయన అన్నారు.

తెలంగాణవారు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని, వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. తెలంగాణలోని ఆంధ్రుల బాగోగులను దృష్టిలో ఉంచుకుని సీమాంధ్ర నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలను శాంతిమార్గంలో నడిపించాలని ఆయన సూచించారు. తెలంగాణది కొత్త సమస్య కాదని ఆయన అన్నారు. విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని, వారిని కాళ్లు మొక్కి దీక్షలు విరమింపజేశామని ఆయన చెప్పారు. ప్రజలను ఉసిగొల్పడం మంచిది కాదని ఆయన అన్నారు. తమ మాటలను తెలంగాణ వ్యతిరేకులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఇరుగు పొరుగు రాష్టాలుగా ఉండబోతున్నామని, అందువల్ల సామరస్యం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X