లగడపాటి అదృశ్యంలో పోలీసుల నిర్లక్ష్యం లేదు
దీంతో సీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, సెంట్రల్జోన్ ఏసీపీ ఆవుల సుబ్బారావు, మాచవరం సీఐ లక్ష్మీపతి, పాయకాపురం సీఐ ధర్మేంద్ర, మాచవరం క్రైం ఎస్ఐ కమలాకర్, గవర్నర్పేట ఎస్ఐ భాస్కరరావును సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఐడీ అదనపు డీజీ శివన్నారాయణను విచారణాధికారిగా నియమించింది. శివన్నారాయణ రెండు రోజులపాటు విచారణ జరిపి నివేదికనిచ్చారు.
దీని ఆధారంగా సస్పెన్షన్ను తొలగించాలని డీజీపీ నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితమే సీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి కే రోశయ్య హామీ ఇచ్చారు. ఎక్కడి వారికి అక్కడే పోస్టింగ్ ఇచ్చేందుకు సుముఖతను కూడా వ్యక్తం చేశారు. సస్పెన్షన్లను ఎత్తివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.