వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమం ఆగదు: తెలంగాణ జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు ఉద్యమం కొనసాగించాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి నిర్ణయించింది. జనవరి 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన రాజకీయ పార్టీలతో చర్చలను స్వాగతిస్తూనే ఉద్యమం కొనసాగించాలని జెఎసి నిర్ణయించింది. రాజకీయ పార్టీలను ఈ నెల 5వ తేదీన చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెఎసి బుధవారం రాత్రి సమావేశమై సమీక్ష జరిపింది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోకూదని జెఎసి తీర్మానం చేసింది.

జెఎసి సమావేశంలో చేసిన తీర్మానాలను కన్వీనర్ కోదండరామ్ మీడియా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణపై రాజకీయ పార్టీలను కేంద్రం చర్చలకు ఆహ్వానించడం శుభపరిణామమని ఆయన అన్నారు. బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేసినందకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు శాంతియుతంగా, పల్లె పల్లెనా ఆందోళనలు కొనసాగించాలని జెఎసి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. శాసనసభ్యుల రాజీనామాల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి తేవాలనే నిర్ణయాన్ని జనవరి 5వ తేదీ వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కోదండరామ్ చెప్పారు. దానిపై 5వ తేదీ తర్వాత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X