వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర: రఘువీరా

By Santaram
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
కళ్యాణదుర్గం: హెలికాప్టర్‌ దుర్ఘటనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణించడం వెనుక కుట్ర ఉందని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శనివారం ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ప్రమాద స్థలిని పరిశీలించిన అందరిలోనూ ఇదే సందేహం వ్యక్తమైందన్నారు.

అంతకు ముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎల్‌.ఎం.మోహన్‌ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తగా మంత్రి ఈ మేరకు స్పందించారు. వైఎస్‌ మృతిపై సీబీఐ నిర్వహిస్తున్న దర్యాప్తులో కచ్చితంగా ఈ వాస్తవం తేలుతుందన్న నమ్మకం ఉందన్నారు. దీనికి సంబంధించి ప్రధాని మన్మోహన్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీలతో చర్చిస్తానని చెప్పారు.

కలిసి ఉంటేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమ ని, తాను నిఖార్సయిన సమైక్యవాదినని రఘువీరా పునరుద్ఘాటించారు. కార్యకర్తల భేటీ తర్వాత ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే సుధాకర్‌లతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాజకీయ స్వార్థపరులు కొందరు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X