వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీతిలేని కోతి కెసిఆర్, టీఅర్ఎస్ దొంగల పార్టీ: మారెప్ప

By Santaram
|
Google Oneindia TeluguNews

Mareppa
నంద్యాల: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, నీతిలేని కోతిలా వ్యవహరిస్తున్నాడని మాజీమంత్రి మారెప్ప వ్యాఖ్యానించారు. శనివారం ఆయన, కర్నూలు జిల్లా నంద్యాలలో గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పామోహన్‌రెడ్డిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అంటేనే దొంగల ప్రాంతీయ పార్టీ అని, కేసీఆర్‌ పదవీ వ్యామోహంతో రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పన్నాగాలు పన్నుతున్నాడని ధ్వజమెత్తారు. జానారెడ్డికి మంత్రి పదవి వచ్చిఉంటే ఇలా మాట్లాడేవారా? అన్నారు.

గుడిసెల డబ్బు మింగి బలిసిన కాకా, వెర్రికేకలు వేస్తున్నాడని విమర్శించారు. మూడుసార్లు ఓడిన డీఎస్‌, ఉస్మానియా వర్సిటీలో డీజిల్‌ అమ్ముకుం టూ బతికిన వీహెచ్‌, సామాన్య పాత్రికేయుడైన కేకే, పదవుల కోసం పాకులాడుతున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రూకల కోసం, తోకల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. వైఎస్‌ ఉండగా నోరెత్తే ధైర్యంలేని వారంతా ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వార్డుల్లో కూడాగెలవలేని వారంతా ఢిల్లీలో సిల్లీగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అడిగిన వారికల్లా ఓ ముక్క పంచుతూపోతే దేశం వందల చెక్కలవుతుందని చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల, పులిచింతల, దేవాదుల ప్రాజెక్టుల తో తెలంగాణ పురోగమిస్తుందన్నారు. అలాగే పోలవరంతో కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాలను పుస్తక రూపంలో సోనియాగాంధీకి అందజేశానన్నారు. గడచిన 63 ఏళ్లుగా సీమాంధ్రవాసులు హైదరాబాద్‌లో పెట్టిన పెట్టుబడులను వెనక్కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం అగ్నిగుండం మారడానికి కారకులెవరో ప్రజలకు తెలుసునన్నారు. సీమాంధ్ర, తెలంగాణల్లోని భాగ్యవంతులంతా ఫోన్లలో అభినందించుకుంటూ పత్రికల్లో మాత్రమే కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X