నీతిలేని కోతి కెసిఆర్, టీఅర్ఎస్ దొంగల పార్టీ: మారెప్ప
గుడిసెల డబ్బు మింగి బలిసిన కాకా, వెర్రికేకలు వేస్తున్నాడని విమర్శించారు. మూడుసార్లు ఓడిన డీఎస్, ఉస్మానియా వర్సిటీలో డీజిల్ అమ్ముకుం టూ బతికిన వీహెచ్, సామాన్య పాత్రికేయుడైన కేకే, పదవుల కోసం పాకులాడుతున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రూకల కోసం, తోకల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. వైఎస్ ఉండగా నోరెత్తే ధైర్యంలేని వారంతా ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వార్డుల్లో కూడాగెలవలేని వారంతా ఢిల్లీలో సిల్లీగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అడిగిన వారికల్లా ఓ ముక్క పంచుతూపోతే దేశం వందల చెక్కలవుతుందని చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల, పులిచింతల, దేవాదుల ప్రాజెక్టుల తో తెలంగాణ పురోగమిస్తుందన్నారు. అలాగే పోలవరంతో కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాలను పుస్తక రూపంలో సోనియాగాంధీకి అందజేశానన్నారు. గడచిన 63 ఏళ్లుగా సీమాంధ్రవాసులు హైదరాబాద్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అగ్నిగుండం మారడానికి కారకులెవరో ప్రజలకు తెలుసునన్నారు. సీమాంధ్ర, తెలంగాణల్లోని భాగ్యవంతులంతా ఫోన్లలో అభినందించుకుంటూ పత్రికల్లో మాత్రమే కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు.