చిదంబరంతో ఎపి నేతల వరుస భేటీలు

కాగా, చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి చెందిన తెలంగాణ శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి కూడా చిదంబరాన్ని కలిశారు. చిరంజీవి వైఖరిని ఆయన వ్యతిరేకించారు. సమైక్యాంధ్ర వైఖరి చిరంజీవి వ్యక్తిగతమే కాని పార్టీ అభిప్రాయం కాదని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా చిరంజీవి ప్రకటనలు చేసిన వైనాన్ని, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన విషయాన్ని ఆయన చిదంబరానికి వివరించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా చిదంబరాన్ని కలిశారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వారు తమ వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సల్స్ ప్రాబల్యం పెరుగుతుందనే కొత్త వాదనను ముందుకు తెచ్చి వారు మాట్లాడారు. హైదరాబాద్ ఐఎస్ఐ అడ్డాగా మారుతుందని కూడా వారు చెప్పారు. కాగా, మజ్లీస్ సోదరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చిదంబరంతో భేటీ అయ్యారు. రాష్టంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications