వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ నా నేత: మద్దెలచెర్వు సూరి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే తనను పరిటాల రవి హత్య కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. జైలు జీవితం పగవాడికి కూడా వద్దని ఆయన అన్నారు. తాను నిర్దోషిగా విడుదలవుతాననే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే తాను 13 ఏళ్ల జైలు శిక్ష అనుభవించానని, ప్రభుత్వం తనకు క్షమాభిక్ష ప్రసాదించడం న్యాయమేనని ఆయన అన్నారు. తనకు పరిటాల రవికి మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవని, రాజకీయ విభేదాలు మాత్రమే ఉండేవని ఆయన అన్నారు. తన కుమారుడికి తాను జైల్లో ఉన్నట్లు తెలియదని, తన కుమారుడి భవిష్యత్తు తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. తనకూ తన భార్యకూ మధ్య స్పర్థలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాను జైల్లో సెల్ ఫోన్ వాడినట్లు వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. జైలులో ఉండి సెటిల్ మెంట్లు చేసినట్లు వచ్చిన ఆరోపణలు కేవలం కల్పితమని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, January 7, 2010, 14:16 [IST]