22 గంటల ఎదురుకాల్పులు: ఇద్దరు హతం

ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకతను స్థానికుడైన ఉస్మాన్ కాగా, మరొకతను పాకిస్తానీ అని తెలుస్తోంది. 2007 అక్టోబర్ నుంచి శ్రీనగర్ లో ఇది తొలి ఫిదాయీ దాడి. ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ అధికారులను లక్ష్యంగా చేసుకుని పికెట్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు మరణించాడు. వెంటనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. హోటళ్లోకి వెళ్లి ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరుపుతున్నారు. హతమైన ఇద్దరు ఫిదాయిలు కూడా లష్కరే తోయిబాకు చెందినవారని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications