గాంధీభవన్ ను వేదికగా చేసుకోవద్దు: డి శ్రీనివాస్

D Srinivas
హైదరాబాద్: వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడానికి పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ను వేదికగా మార్చుకోవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ విధానాన్ని మాట్లాడడానికి మాత్రమే గాంధీభవన్ ను వాడుకోవాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో సమావేశంలో పార్టీ నాయకులను ఆదేశించారు. వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించాలనుకుంటే వేరే చోటు నుంచి మాట్లాడాలని ఆయన అన్నారు. టీవీ చానెళ్లలో తమ పార్టీ నాయకులు మాట్లాడేవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీ వైఖరి మాట్లాడాలనుకుంటే ముందుగా పార్టీ నాయకత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయంపై మీడియాకు తాను లేఖలు రాయనున్నట్లు ఆయన తెలిపారు.

మీడియా చానెళ్లలో సీనియర్ కాంగ్రెసు నాయకులు కూడా పార్టీ విధానానికి భిన్నంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడేవారిని సహించబోమని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. వైయస్ మరణంపై పాత సమాచారం చూపించి రెచ్చగొట్టడం సరికాదని ఆయన అన్నారు. వైయస్ మరణంపై సిబిఐ విచారణ జరుగుతోందని, అది పూర్తయ్యే వరకు వేచి చూడడం మంచిదని ఆయన అన్నారు.

దాడులు అనాగరికమని, గాంధీభవనలో ఎలాంటి నిరసనలు చేయకూడదని ఆయన సూచించారు. పరీక్షలు రాయాలని విద్యార్థులు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు. వార్తా కథనాల ప్రసారం విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. తమ పార్టీ నేతలు మాట్లాడే విషయాలను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+