తెలంగాణపై త్వరలో కమిటీ: కెఎస్ రావు

కాగా, కాంగ్రెసు కోర్ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమవుతోంది. తెలంగాణపై ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితి విధించడానికి వీలవుతుందా లేదా అనే ఆంశాన్ని కూడా కోర్ కమిటీ పరిశీలిస్తుంది. చర్చల ప్రక్రియకు కమిటీ వేయాలా, వేస్తే ఆ కమిటీ ఎలా ఉండాలి, కాలపరిమితి ఎంత పెట్టాలి వంటి అంశాలపై కాంగ్రెసు కోర్ కమిటీ చర్చిస్తుంది. అలాగే, రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ ను కొనసాగించాలా, వద్దా అనే అంశాన్నికూడా పరిశీలించే అవకాశం ఉంది. రిలయన్స్ కార్యాలయాలపై దాడులు కూడా చర్చల్లో ప్రధానం కావచ్చు.












Click it and Unblock the Notifications