వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం కోరుతూ హైద్రాబాద్ లో 10 కె రన్

By Santaram
|
Google Oneindia TeluguNews

10K Run
హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు కావాలంటూ నగరంలో నిర్వహించిన తెలంగాణ 10కె రన్‌కు మంచి లభించింది. ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహంనుంచి ఇందిరాపార్కువరకు ఈ రన్‌ను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో కళాకారులు, స్వాతంత్య్రయోధులు, సినీరంగప్రముఖులు... తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇలా ఉండగా తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడిన సాక్షి టీవీ సీఈవో ప్రియదర్శిని రాంరెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది.

శనివారం సాయంత్రం మీడియాలో మాట్లాడిన రాంరెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో విధ్వంసం జరిగిందని చెబుతూ రాజకీయ నాయకులను, జర్నలిస్టులను దీనికి బాధ్యులుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజేఎఫ్‌ కన్వీనర్‌ అల్లం నారాయణ, కో-కన్వీనర్‌ పిట్టల శ్రీశైలం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X