విజయ్ పార్టీ ఆఫీసుకు నిప్పుపెట్టిన దుండగులు.. సీసీ టీవీ ఫుటేజ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. తిరుచ్చిలోని శ్రీరంగం నియోజకవర్గ పరిధిలో ఉన్న తమిళగ వెట్రి కజగం (TVK) ప్రచార కార్యాలయంపై గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేసి నిప్పుపెట్టారు. మే 4న ఫలితాలు వెలువడనున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పెట్టవైత్తళై ప్రాంతంలో ఉన్న టీవీకే అభ్యర్థి రమేష్కు చెందిన ఈ కార్యాలయంలోకి మే 1వ తేదీ సాయంత్రం 4:43 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు చొరబడినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. కార్యాలయానికి నిప్పుపెట్టిన వెంటనే ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కార్యాలయంలోని కీలకమైన ప్రచార సామగ్రి, ఓటర్ల జాబితాలు, ముఖ్యమైన పత్రాలు మరియు బ్యానర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఉద్రిక్తతలో శ్రీరంగం.. రంగంలోకి పోలీసులు
మరుసటి రోజు ఉదయం కార్యాలయం వెలుపల ఉన్న పార్టీ అధినేత విజయ్ పోస్టర్లు, బ్యానర్లు కూడా చించివేసి ఉండటంతో టీవీకే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటనపై పార్టీ నుంచి ఇంకా అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా తిరుచ్చి జిల్లాలోని రాజకీయ సున్నిత ప్రాంతాల్లో భారీగా భద్రతను పటిష్ఠం చేశారు.
ప్రార్థనల్లో విజయ్.. ఫలితాలపై ఉత్కంఠ
ఒకవైపు కార్యాలయంపై దాడి జరగగా, మరోవైపు టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ ఆధ్యాత్మిక పర్యటనలో నిమగ్నమయ్యారు. మే 2న ఆయన వేలంకన్ని బాసిలికా మరియు నాగూర్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మే 4న జరగబోయే ఓట్ల లెక్కింపులో టీవీకే ప్రభావం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొన్న తరుణంలో జరిగిన ఈ దాడులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Exclusive:-CCTV footage clearly captures the arson at the TVK election office in Thiruvarangam constituency 😡🙁
— Prasaanth (@prasaanth_07) May 1, 2026
Undeniable proof @AadhavArjuna @TVKVijayHQ pic.twitter.com/8ethWJ10Vf














Click it and Unblock the Notifications