డిజిపిపై తెలంగాణ నేతలు గరం

రాజకీయాలు మాట్లాడాలనుకుంటే గిరీష్ కుమార్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని తెలుగుదేశం, తెరాస నాయకులు ఆయనకు సూచించారు. డిజిపి బాధ్యతారహితంగా మాట్లాడారని వారన్నారు. తెలంగాణ ప్రజలకు డిజిపి క్షమాపణ చెప్పాలని తెరాస నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి డిజిపి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో నక్సల్స్ లేరని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా డిజిపి మాట్లాడారని ఆయన అన్నారు. డిజిపి రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు.
డిజిపి వ్యాఖ్యలను తెలుగుదేశం నాయకుడు వేణుగోపాలాచారి ఖండించారు. ఉన్నత పదవిలో ఉన్న డిజిపి రాజకీయ నాయకుడిలా మాట్లాడడం తగదని ఆయన అన్నారు. ఓయు ఉద్యమంలో నక్సలైట్లు ఎవరూ లేరని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలను డిజిపి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications