తెలంగాణ జెఎసి నుంచి కాంగ్రెస్ ఔట్?

కాంగ్రెసు పార్టీ విడిగా కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్సలు వస్తుండడంపై కూడా కాంగ్రెసు నాయకులు మనసు చిన్నబుచ్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే పూర్తిగా జెఎసి నుంచి కాంగ్రెసు బయటకు రావాలని నిర్ణయం తీసుకోలేదు. సొంతంగా ఉద్యమం చేపట్టాలని మాత్రం నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిత్తశుద్ధితో ఉన్న తమ నాయకులను లక్ష్యంగా చేసుకోవడంపై కూడా కాంగ్రెసు నాయకులు తప్పు పడుతున్నారు. మొత్తం మీద కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులకు ముందుకు పోలేని, వెనక్కి రాలేని స్థితి నెలకొని ఉంది. విద్యార్థుల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక, అధిష్టానం నుంచి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన ఇప్పించలేక ఇబ్బంది పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications